Magic figure Congress : కర్ణాటక ఎన్నికల ఫలితాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ ప్రకారం కాంగ్రెస్ దూసుకెళ్తున్నది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా కాంగ్రెస్ నిలిచే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్ 120 కిపైగా సీట్లలో ముందంజలో ఉంది. బీజేపీ 80, జేడీయూ 20కి పైగా సీట్ల వద్ద ట్రెండింగ్ కొనసాగుతున్నది. మొత్తం 12 రౌండ్లలో లెక్కింపు చేయనున్నారు. తొలిరౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ 120 కి పైగా సీట్లలో పూర్తిస్థాయి అధిక్యంలో కొనసాగుతున్నది.
హేమాహేమీల పరిస్థితి ఇలా..
ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం చెన్నపట్నంలో జేడీయూ నేత కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు. ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి కూడా కొంత ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు కనకపురలో డీకే శివకుమార్, వరుణ లో సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారు. షిగ్గావ్ లో బీజేపీ కీలక నేత బస్వారజ్ బొమ్మై కూడా ముందంజలో ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి దంపతులు, జగదీశ్ శెట్టర్, ప్రియాంక ఖర్గే ముందంజలో ఉన్నారు.
తొలిరౌండ్ పూర్తయ్యే సరికి 120 కి పైగా సీట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం కొంత జేడీఎస్ కు ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తు్న్నది. మరోవైపు బీజేపీ కి చెందిన పలువురు మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. మోదీ, షా ప్రచారం చేసిన ప్రాంతాల్లో కూడా కొంత నెగిటివ్ ట్రెండ్స్ వస్తున్నాయి. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు కూడా బీజేపీని కొంత దెబ్బతీసినట్లుగా కనిపిస్తున్నది. ఏదేమైనా కాంగ్రెస్ భారీ సీట్లతో గెలిస్తే 2024 లోక్ సభ ఎన్నికల వేళ ఆపార్టీకి ఇది మంచి జోష్ ఇచ్చినట్లు అవుతుంది.