AP High Court :
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీలో ఆయనపై నమోదైన కేసుల్లో ఆయనకు ఊరట దక్కలేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్న పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో సోమవారం ఆయనకు లభిస్తుందనే ఆశలకు గండి పడింది.
గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ అంశాల్లో అక్రమాలు జరిగాయంటూ అప్పటి సీఎం చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నదనే నేపథ్యంలో బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటితో పాటు ఇటీవల అంగళ్లు వద్ద అల్లర్ల విషయంలో కూడా ఆయనపై కేసు నమోదు చేశారు. కార్యకర్తలను అల్లర్లకు పురిగొల్పారని ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈ కేసుల్లో మిగతా వారికి బెయిల్ లభించింది. కానీ చంద్రబాబుకు మాత్రం ఉపశమనం లభించలేదు.
అయితే ఏపీ హైకోర్టు ఈ మూడు పిటిషన్లు డిస్మిస్ చేయడంతో సుప్రీం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయన తరఫున లాయర్లు సిద్ధమవుతున్నారు. అయితే హైకోర్టులో ఊరట లభిస్తుందని భావిస్తున్న తరుణంలో చంద్రబాబుకు చుక్కెదురైంది. ఇక సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని ఆయన తరఫున లాయర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక మరోవైపు సుప్రీంలో క్వాష్ పిటిషన్ పై కూడా మరికాసేపట్లో విచారణ జరగనుంది. దీంతో పాటు విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కూడా తీర్పు మరికాసేపట్లో తీర్పు రానుంది.