AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళ గిరి నుంచి పోటీలో ఉన్నారు. అదేవిదంగా పిఠాపురం నుంచి జనసేన అధినేత రంగంలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా కూటమి నాయకులే కావడం విశేషం. కూటమిగా ఏర్పడిన నాయకుల లక్ష్యం ఒకటే. అది వైసీపీ నేత, ప్రస్తుత సీఎం జగన్ ను ఇంటిదారి పట్టించడమే. ఆ ముగ్గురు కలిసి జగన్ ను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అంతే పట్టుదలతో జగన్ కూడా ముగ్గురు ప్రధాన నాయకులను ఓడించడానికి పట్టుదలతో ఉన్నారు.
కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను ఓడించడానికి ఆ మూడు నియోజక వర్గాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకోడానికి డబ్బు, మద్యం పంపిణి చేస్తున్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాటితో పాటు ఓటుకు నాలుగు వేల రూపాయలను కూడా పంపిణి చేస్తున్నట్టుగా ఆరోపణలు గుప్పుమన్నాయి. కూటమికి చెందిన ద్వితీయ, తృతీయ నేతలకు డబ్బుతో ఆశలు పెడుతున్నట్టుగా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
కుప్పం, మంగళ గిరి, పిఠాపురం నియోజకవర్గంలో ఎలాగయినా వైసీపీ అభ్యర్థులు గెలవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. ముగ్గురు ప్రధాన నాయకులు ఓటమిపాలైతే తెలుగు దేశం, జనసేన పార్టీల నుంచి ఎవరు గెలిచినా రెండు పార్టీలు బలహీన పడుతాయి. ఒకవేళ అత్తెసరు మెజార్టీ వచ్చినా , రెండు పార్టీల నుంచి గెలిచిన వారిని ఆకట్టుకోవదానికి సులువవుతుంది. ఈ ఆలోచనతో వైసీపీ ఆ మూడు నియోజకవర్గాల్లో ఓటుకు నాలుగు వేలు ఇవ్వడంతోపాటు మద్యం కూడా అదనంగా పంపిణి చేస్తోందనే ఆరోపణలు కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ కుట్రను తిప్పికొట్టడానికి కూటమి నేతలు కూడా సిద్దంగానే ఉన్నారు. మూడు ప్రాంతాల్లో ముఖ్యమైన నాయకులను గెలిపించు కోవాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రలోభాలకు లొంగకుండా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాయకత్వం చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కూటమి మేనిఫెస్టో ను వివరిస్తూ ప్రచారం చేస్తూ ఆకట్టుకున్న తీరు ఏ మేరకు ఫలితం ఇవ్వనుందో వేచిచూడాల్సిందే.