Color Swati : కలర్స్ పేరుతో మా టీవీలో ప్రసారమైన షో ద్వారా తెలుగమ్మాయి స్వాతి పాపులర్ అయ్యారు. టీనేజ్ లోనే బుల్లితెరను తనదైన యాంకరింగ్, యాక్టింగ్ స్కిల్స్తో మంచి పేరు సంపాదించుకుంది. స్వాతి పేరు మోసిన హీరోయిన్ కాకుండానే చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది.ఆమె స్మైల్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. టెలివిజన్ షోల ద్వారా వచ్చిన ఫేంతో ఆమెకు దర్శకుడు కృష్ణవంశీ తొలిసారిగా డేంజర్ చిత్రంలో నటిగా అవకాశం ఇచ్చారు.
ఆ తర్వాత అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్ వంటి సినిమాలు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.కొంతకాలం సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో 2018లో తన ప్రియుడు వికాస్ వాసును పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. అతను వృత్తి రీత్యా పైలట్. మ్యారేజ్ అయ్యాక వెండితెరకు దూరమైన స్వాతి..కొంతకాలం కిందట ఆమె ఇండియాకు తిరిగొచ్చారు. కమ్ బ్యాక్ తోనే పంచతంత్రం మూవీ చేశారు.
ఈ క్రమంలోనే స్వాతి ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రం మూవీ ప్రమోషన్స్లో భాగంగా హీరో సాయి ధరమ్ తేజ్కు అందరూ చూస్తుండగానే స్టేజీ మీద ముద్దు పెట్టారు. దీంతో అక్కడున్న వారితో పాటు మీడియా మిత్రులు కూడా షాకయ్యారు. పెళ్లాయ్యక ఇలా వేరే వ్యక్తిని ముద్దాడటం ఏంటని చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే, సాయిధరమ్ తేజ్ స్పీచ్ అనంతరం అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.
కలర్స్ స్వాతి, సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ ఒకే దగ్గర చదువుకున్నారు. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. కాలేజీ రోజుల నుంచే వీరి మధ్య పరిచయం ఉంది. అప్పట్లో తాను స్వాతి ఎగ్జామ్ పేపర్ చూసి కాపీ కొట్టేవాడినని సాయి చెప్పడంతో అంతా నవ్వుకున్నారు. స్వాతి కూడా ఒక్కసారిగా స్మైల్ ఇచ్చింది. స్వాతిని తేజ్ స్వాతిగాడు అని పిలుస్తానని చెప్పాడు. ఇలా స్టేజీ మీద సరదాగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.