Krithi Shetty :
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని అంటారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. దీంతో ఆమెకు మంచి మార్కులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెకు సక్సెస్ లు దక్కలేదు. బంగార్రాజు హిట్టయినా ఆమెకు తరువాత విజయాలు దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఆఫర్లు లేక ఖాళీగా ఉంటోంది.
రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో మొదట జాన్వీకపూర్ ను హీరోయిన్ గా అనుకున్నా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు కృతిశెట్టిని తీసుకోవాలని అనుకుంటున్నారట. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అసలే అపజయాల బారిన పడిన పడిన ఆమెతో ఉప్పెన 2 తీస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
కృతిశెట్టికి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్లీ కలిసి నటించే అవకాశం రావడంతో ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. స్పోర్ట్స్ ప్రధానంగా సాగే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో నిరంతరంగా కొనసాగుతుందని చెబుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు.
నాగచైతన్యతో కస్టడీ సినిమాలో నటించినా అది కూడా బోల్తా కొట్టింది. కృతి శెట్టికి సరైన అవకాశాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తనకు మొదటి విజయం అందించిన దర్శకుడే ఇప్పుడు మళ్లీ చాన్స్ ఇవ్వడం యాదృచ్ఛికమే అయినా ఆమెకు బ్రేక్ కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నారు. మొత్తానికి కృతి శెట్టి ఎక్కడ పోడగొట్టుకుందో అక్కడే వెతుక్కుంటోంది.