KTR Car Garrage : తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీరుపై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో కారు షెడ్డుకు పోతోందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో టిల్లుకు కోపం వస్తుందని కేటీఆర్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు గాలికొదిలి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ లో చెల్లె ఓటమి ఖాయమైందని జోస్యం చెప్పారు. దీని వల్ల కేటీఆర్ కు పట్టరాని కోపం వస్తుందని పేర్కొన్నారు.
తొమ్మిదేళ్ల పాలనలో దొంగ కొంగల జపం బయట పడిందని గుర్తు చేశారు. వరంగల్ డల్లాస్ కాలే నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదు. ఆదిలాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ లు రాలేదు. లక్ష ఉద్యోగాలు జాడలేవు. ఇలా రాష్ట్రంలో గులాబీ పార్టీ నియంత పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర పడిందని చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కాకుండా ఇతర పనులు చేసి వాటినే తమ గొప్పలుగా చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి హామీలు నెరవేర్చకుండా తప్పించుకు తిరుగుతున్న సీఎం కేసీఆర్ ఒక్కరే కావడం గమనార్హం. ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు కాలం దగ్గర పడిందని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. సమస్యలు గాలికొదిలేస్తోంది. వాపును చూసి బలుపు అని మురుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఇంటికి పంపించడం ఖాయం. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక తాను ముక్కలే. అందుకే ఆ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుందని జోస్యం చెప్పారు.