KTR Efforts Over Kamareddy : తెలంగాణలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీఎం కేసీఆర్ తన నియోజకవర్గం గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ అంశం బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది.
ఇదే విషయంలో మంత్రి కేటీఆర్ ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై గతంలో జరిగిన ఉద్యమం నేపథ్యంలో నమోదైన కేసులను తీసివేయిస్తామని హామీనిస్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ విషయంలో ఇద్దరు, ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మాస్టర్ ప్లాన్ పై సముఖంగా ఉన ప్రభుత్వం తర్వాత దిగి వచ్చింది. మాస్టర్ ప్లాన్ రద్దుకు ఉత్తర్వులు విడుదల చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇక ఎన్నికల తేదీ నాటికి కేసీఆర్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేటీఆర్ ప్రయత్నిస్తు్న్నారు. రైతులను పిలిచి మాట్లాడుతున్నారు. ఇక జేఏసీ నేతలను ప్రగతి భవన్ కు పిలిపించుకుకొని మాట్లాడినట్లు సమాచారం. ఏదేమైనా కేటీఆర్ ఈ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు ఎలాంటి పోటీ లేకుండా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పై అసంతృప్తంగా ఉన్న వివిధ వర్గాల నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ గెలుపునకు సహకరించాలని కోరారు. ఆయన గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని సిద్ధిపేట, సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీనిస్తున్నారు. రానున్న రోజల్లో ఇక్కడి ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.