Mobile Blast : బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో ఓ యువకుడి ప్యాంటు జేబులో మొబైల్ ఫోన్ పేలింది. ప్రసాద్ అనే యువకుడు జేబులో వన్ ప్లస్ ఫోన్ పెట్టుకొని బైక్ పై వెళుతుండగా ఒకసారిగా ఆ ఫోన్ పేలిపోయింది. దీంతో అతని తొడకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రిలో చేరగా చికిత్సకు నాలుగు లక్షలు అవుతుందని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. కంపెనీ షో రూమ్ లో దీనిపై బాధితుడు సంప్ర దించగా ఔషధాలకు అయ్యే ఖర్చు మొబైల్ డబ్బులు భరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత సమాజంలో సెల్ ఫాన్ లేనిదే ఏ పని జరగడం లేదు. ఎవరి చేతిలో చూసిన సెల్ ఫోన్క చ్చితంగా దర్శనమిస్తుంది. సెల్ వినియోగం అధికమైన నేపథ్యంలో వాటి వల్ల కూడా అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా సెల్ ఫోన్ కు రాత్రి అంతా చార్జింగ్ పెట్టడం వల్ల గతంలో కొన్ని ఫోన్లు పేలి కొంతమంది మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి.
అయితే చార్జింగ్ పెడితే అలా జరుగుతుంది ఫోను జేబులో పెట్టుకుంటే కూడా ప్రమాదం జరుగుతుం దని ఈ సంఘటన చూసిన తర్వాత మనకు అర్థమవు తుంది. సెల్ ఫోన్ కొనేటప్పుడు కంపెనీ లను జాగ్రత్తగా చూసుకొని కొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంతవరకు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.