‘Kalki 2898 AD’ :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీల్లో ఒకటిగా వస్తుంది ‘కల్కి 2898 AD’. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ఆయనకు మరో సినిమా దక్కలేదు. ఏ సినిమా అయినా ఆయన క్రేజ్ పైనే కలెక్షన్ల వర్షం కురిసింది. రీసెంట్ గా వచ్చిన ‘ఆదిపురుష్’ కూడా నెగెటివ్ టాక్ సంపాదించుకున్నా ప్రభాస్ నేమ్ తోనే కలెక్షన్లు దక్కించుకుంది. ‘కల్కి 2898 AD’కి సంబంధించి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
వర్కింగ్ టైటిల్ గా ‘ప్రాజెక్ట్-కే’ అని పిలుచుకుంటూ స్టార్ట్ చేసి క్యూరియాసిటీ పెంచుతూ వచ్చారు నాగ్ అశ్విన్. పైగా రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. వర్కింగ్ టైటిల్ కు అర్థం ఏంటని? జనం చర్చించుకుంటుండగానే ‘కల్కి 2898 AD’ అని మూవీ టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
టైటిల్ గ్లింప్స్ తో ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్లో ప్రస్తుతం వినిపిస్తోంది. దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు.
‘కల్కి 2898 AD’కి సీక్వెల్ అనే ఆలోచన ఇప్పటికైతే లేదన్నాడు. ఈ మూవీ కోసం క్రియేట్ చేసిన రోల్స్, వాహనాలు, ప్రదేశాలతో యానిమేటెడ్ వెర్షన్ రావచ్చనే మాత్రం వెల్లడించారు. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే ఈ కల్కిని రూపొందించామని చెప్పారు.
2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ దీనిపై ఇటీవల భిన్నమైన వాదనలు వస్తున్నాయి. రిలీజ్ డేట్ వాయిదా వేశారని అంతా అనుకుంటున్నారు. జనవరి నుంచి మేకు తీసుకెళ్లా మేకర్స్ భావిస్తున్నారట.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. వారి బ్యానర్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి మే 9వ తేదీనే రిలీజ్ అయ్యాయి. అవి భారీ హిట్లు సాధించడంతో ఈ డేట్ ను సెంటిమెంట్ గా తీసుకుంది మేకర్స్. బహూషా ‘కల్కి 2898 AD’ కూడా అదే డేట్ నాడు రిలీజ్ చేస్తారని సమాచారం.
రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రభాస్ హీరో కాగా, ఆయన సరసన హీరోయిన్ గా దీపికా పదుకోణ్ నటిస్తోంది.
లోకనాయకుడు కమల్, బిగ్ బీ కీలక పాత్రల్లో కనిపించబోతన్నారు. కమల్ దాదాపు విలన్ అన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మూవీకి ప్రమోషన్స్ విషయంలో సరికొత్త దారుల్లో వెళ్తున్నారు మేకర్స్. ఎప్పటికప్పుడు బజ్ క్రియేట్ చేస్తూ అంచనాలు పెంచుతున్నారు.