No one passed those Schools : పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం రిలీజ్ అయ్యాయి. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా రిజల్ట్స్ కోసం ఆతృతగా ఎదురు చూశారు. రాష్ర్ట విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి బుధవారం (మే 10) రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉన్నాయి.. పర్సంటేజ్ ఎంత తెలుసుకుందాం..
పదో తరగతి పరీక్షల్లో రాష్ర్ట వ్యాప్తంగా మొత్తం 86.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో నిర్మల్ జిల్లా టాప్ ప్లేస్ (మొదటి స్థానం)లో 99 శాతంతో ఉంది. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. జూన్ 14 నుంచి 22వ తేదీ వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉంటాయని విద్యాశాఖ అధికారులు సూచించారు.
ఈ నెల 26వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కోసం ఫీజులు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒక వేళ రీకౌంటింగ్ పెట్టుకోవాలంటే ఒక సబ్జెక్టుకు రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో అత్యల్పంగా 72.39 శాతం పాసైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక గురుకులాల గురించి పరిశీలిస్తే 98.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.
పాన్ కాని విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మళ్లీ ఎగ్జా్మ్స్ రాసుకోవచ్చని బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవచ్చని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. ఫెయిల్ అయ్యామని అధైర్య పడుతూ సూసైడ్ చేసుకోవద్దని, పరీక్షలు మళ్లీ మళ్లీ వస్తాయి కానీ ప్రాణం ఒక్కాసారి పోతే తిరిగిరాదని సూచిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అధైర్య పర్చవద్దని మళ్లీ చదివేలా ప్రోత్సహించాలంటున్నారు.