T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు రవసత్తంగా సాగుతున్నాయి. ఈ టోర్నీ ముగియనగానే ప్రతిష్ఠాత్మక టీ20 వర్డర్ కప్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది తొలిసారిగా ఇరవై జట్లు టోర్నీలో పాల్గొనబోతున్నాయి. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో సంయుక్తంగా ఈ మెగా క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. దాదాపు నెల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.
రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత జూన్ 9న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా తలపడనుంది. ఐపీఎల్ మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నా క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం టీ 20 ప్రపంచకప్ పైనే ఉంది. ఈ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్ నకు టీమిండియా సిద్ధమంటూ స్టార్ స్పోర్ట్స్ చానెల్ ఇంట్రెస్టింగ్ ప్రోమోను షేర్ చేసింది. ‘రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్నది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరూ సిద్ధమా?’ అనే క్యాప్షన్తో సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వీడియోను షేర్ చేసింది.
ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో జాతీయ గేయం ‘వందేమాతరం’ను ప్లే చేయడం విశేషం. ఈ వీడియోలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కనిపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది. వీడియో ఆఖరిలో కోహ్లీ సెల్యూట్ చేయడం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 11 ఏళ్లుగా టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవలేపోయింది. చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని 2013లో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమ్ ఇండియా గెలుచుకుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఓటమి చవిచూసింది. ఈ ఏడాదైనా టీమిండియా టీ 20 ప్రపంచకప్ గెలుస్తుందని భారత క్రీడాభిమానులు భావిస్తున్నారు.