T20 World Cup : వచ్చే నెల (జూన్) 2వ తేదీ నుంచి T20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫామ్ పై అనుమానాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పరుగులను పాక్ కేప్టెన్ బాబర్ ఆజామ్ ఓవర్ టేక్ చేస్తాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
T20 వరల్డ్ కప్ కు ముందు పాకిస్తాన్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటన చేయనుంది. ఈ సిరీస్ లో పాక్ ఏడు మ్యాచ్లు ఆడనుంది. ఇది కెప్టెన్ బాబర్ అజామ్ కు T20లో అత్యధిక పరుగు ఫార్మట్ లో నిలిపేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఇక రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, బాబర్ ఆజామ్ ముగ్గురిలో విరాట్ కోహ్లీ 117 T20 మ్యాచ్ లలో 4037 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, 151 T20ల్లో 3974 పరుగులు చేసి భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. 114 మ్యాచ్ లు ఆడిన బాబర్ 3823 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ గణాంకాలతో బాబర్ రోహిత్ కంటే 151 పరుగులు, కోహ్లీ కంటే 214 పరుగులు మాత్రమే వెనుక ఉన్నాడు.
మే10 నుంచి ఐర్లాండ్ తో పాకిస్తాన్ మూడు T20లు ఆడనుంది. T20 వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లడానికి ముందు పాకిస్తాన్ నాలుగు T20ల సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం పాక్ జట్టులో 18 మంది ఆటగాళ్లు ఉండగా, T20 వరల్డ్ కప్ కోసం 15 మందిని కుదించనున్నారు. జూన్ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా T20 ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇస్తుంది. భారత్ తో సమానంగా పాకిస్తాన్ కూడా ఇదే గ్రూప్ లో ఉండగా, జూన్ 9న న్యూయార్క్ భారత్ తో పాకిస్తాన్ తలపడనుంది.