T20 Indian Team : టీ 20 ప్రపంచ కప్ అమెరికా, వెస్టిండీస్ లో జూన్ 1 నుంచి ప్రారంభం కానుండగా.. అన్ని జట్లు మే 1 లోపు తమ టీంలను ప్రకటించాలని ఐసీసీ ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముంబయి లో ఈ నెల 28 న సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలెక్ట్ చేయనున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్ లో కుర్రాళ్లు దుమ్మురేగ్గొడుతున్నారు. యువ బౌలర్లలో యయంక్ యాదవ్, మోసిన్ ఖాన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఖలీల్ అహ్మద్ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీస్తూ రాణిస్తున్నారు. జస్ ప్రీత్ బుమ్రా, సిరాజ్ ఇద్దరికి జట్టు లో చోటు ఖాయం కాగా.. మూడో పేసర్ కోసం అర్షదీప్ తో పాటు యువ సంచనాలను రేసులో ఉన్నారు.
వికెట్ కీపర్ సెలక్షన్ ఇప్పడు సెలక్టర్లను ఇబ్బంది పెట్టే అంశం. కేఎల్ రాహుల్, సంజు శాంసన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, జితేశ్ శర్మ ఇలా అరడజను మంది రేసులో ఉన్నారు. అయితే జితేశ్ శర్మ ఈ సిరీస్ కు ముందు ఇండియా టీ 20 లో సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఐపీఎల్ లో జితేశ్ శర్మ ఫామ్ కోల్పోయాడు. మరి వికెట్ కీపర్ గా ఎవరిని సెలక్ట్ చేస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
బ్యాటింగ్ లో రోహిత్, యశస్వి జైశ్వాల్, కోహ్లి, సూర్య, తిలక్ వర్మ, ఎంపిక దాదాపు ఖాయం కాగా.. రవీంద్ర జడేజా, హర్దిక్ పాండ్యా ఆల్ రౌండర్లుగా సిద్ధంగా ఉన్నారు. వికెట్ కీపర్ వేట కొనసాగుతుంది. దినేశ్ కార్తీక్ భీకర ఫామ్ లో ఉండడంతో బ్యాట్స్ మెన్ గా జట్లులోకి ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ప్లేస్ పక్కాగా కనిపిస్తోంది. రెండో స్పిన్నర్ కావాలనుకుంటే చాహల్ ను ఎంపిక చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.