T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లకు టీం ఇండియా తుది జట్టుకు ఎవరూ సెలక్ట్ కానున్నారోననే ఒకటే ఉత్కంఠ నెలకొంది. చాలా మంది ఐపీఎల్ ఫర్ఫామెన్స్ ను బట్టే టీం ఇండియా తుది జట్టును సెలక్ట్ చేస్తారని అంచనా వేస్తుంటే.. కొంతమంది ఇండియా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అనుకుంటున్నారు.
ముఖ్యంగా వికెట్ కీపింగ్ స్థానానికి ఎక్కువగా పోటీ ఉంది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, సంజు శాంసన్ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరో ఒకరినే జట్టులోకి ఎంపిక చేయాల్సి ఉండగా.. బీసీసీఐకి తలనొప్పిగా మారింది. సంజు శాంసన్ చాలా బాగా ఆడుతున్నాడు. రిషబ్ పంత్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ వీరిద్దరి కంటే బ్యాటింగ్ బాగా చేయగలడు. ప్రస్తుతం ఈ నలుగురు కూడా బ్యాటింగ్ లో దంచి కొడుతున్నారు.
రోహిత్ శర్మ కెప్టెన్ గా విరాట్ కొహ్లి ప్లేయర్ గా జట్టులో స్థానం పక్కా.. బౌలింగ్ లో డజను మందికి పైగా పోటీ పడుతున్నారు. హర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, సిరాజ్, నటరాజన్, తుషార్ దేశ్ పాండే, మయంక్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ లాంటి ప్లేయర్లు రేసులో ముందున్నారు. బౌలింగ్ విభాగానికి జస్ ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తుండగా.. స్పిన్, పేస్ బౌలర్లు ఇంకా ఎవరేవరనేది తేలాల్సి ఉంది.
మే 1 నాటికి ఐసీసీకి లిస్టు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు బీసీసీఐ లిస్టును ఇంకా ప్రకటించలేదు. తుది జట్టు ఎంపికలో యువతరానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శివమ్ దూబె లాంటి ఆల్ రౌండర్లను తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఐపీఎల్ లో ఎవరూ ఎక్కువగా రాణిస్తున్నారో వారిపైనే బీసీసీఐ సెలక్టర్లు కన్నేశారని.. శశాంక్ సింగ్ సెలెక్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చాలా మంది క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.