sewage water : పండ్లు, కూరగాయలు శుభ్రం చేసి అమ్ముతుంటారు. కానీ అవి మంచి నీరుతో కడిగితే మంచిది. వాటిని మురుగునీటితో శుభ్రం చేయడం సంచలనం కలిగించింది. గతంలో కూడా ఓ సారి కూరగాయలను మూత్రంతో కడిగిన సంఘటన తెలిసిందే. ఇప్పుడు కూడా నోయిడాలో జరిగిన ఓ సంఘటన ఆగ్రహం తెప్పిస్తోంది. శుభ్రతా ప్రమాణాలు పాటించకుండా మురుగునీటితో పండ్లు శుభ్రం చేస్తున్న వీడియో అందరిని కలచివేస్తోంది.
ఈ వీడియో ఆ వ్యాపారి రోడ్డు పక్కన మురుగు నీటితో కొబ్బరికాయలను శుభ్రం చేయడం కెమెరాకు చిక్కింది. ఆ వీడియో వైరల్ అయింది. విషయం కాస్త పోలీసులకు చేరింది. వారు కూడా ఘటన స్థలానికి చేరుకుని డ్రెయినేజీ నీటిని ఉపయోగించిన వ్యాపారిని అరెస్టు చేశారు. ఇలా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిని విడిచిపెట్టేది లేదని చెబుతున్నారు.
ఈ వీడియో చూసి అందరు షాకయ్యారు. ఓ వ్యక్తి ప్లాస్టిక్ కంటైనర్ లో అపరిశుభ్రమైన నీటిని నింపి అమ్మకానికి పోగు చేసిన స్టాక్ పై స్ర్పే చేయడం కనిపించింది. చుట్టుపక్కకల ప్రజలు అతడి నుంి కొబ్బరి నీరు కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ పుటేజీ ట్విట్టర్ లో పెట్టాడు. దీంతో విషయం అందరికి తెలిసింది. అతడి నిర్వాకం బయట పడింది.
మనం తినమనే ఉద్దేశంతో అతడి ఇంతటి దుర్మార్గానికి తెగబడటం అందరిలో ఆగ్రహం కలిగించింది. మనం తినే వాటిని ఎంతో శుభ్రంగా ఉంచుకుంటాం. కానీ అతడు అంత బరితెగించి మురుగునీరు స్ర్పే చేయడం చూసి అవాక్కయ్యాడు. అతడి దుర్మార్గమైన చర్యను బయటి ప్రపంచానికి మాత్రం తెలియజేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. పబ్లిక్ కు నష్టం కలిగించే చర్యను ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు.
Vegetables cleaned in gutter water to add moisture. pic.twitter.com/NeZG28jFKJ
— Advaita👁👁 (@advaitaglance) March 5, 2020