తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను టీడీపీ ఆయుధంగా మార్చుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలను ఆలోచనలో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. అందుకోసం చంద్రబాబు ఆయన అలోచనలకు పదు పెట్టాడు. 43 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న బాబు 2024 ఎన్నికల్లో ఏలాగైనా గెలుపొందాలని ఆరాట పడుతున్నాడు. అందుకోసం ఏ అవకాశం వచ్చినా దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు.
ఎవరు అవునన్నా కాదన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఓక బలం.. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ అప్పట్లో ఒక ప్రభంజనమే… 2 కిలోలకే బియ్యం పథకాన్ని ప్రారంభించిన గొప్ప నేత ఎన్టీఆర్. ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి వాటితో లబ్ది పొందాలని చంద్రబాబు భావించి శతజయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్.. సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఈ వేడుకల ద్వారా ఏన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతికి, వైసీపీకి చెక్ పెట్టారు చంద్రబాబు ఒక మాజీ ముఖ్యమంత్రి శతజయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించలేదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వైసీపీలో ఉండి కూడా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించుకోలేని దుస్థితిలో లక్ష్మీ పార్వతి ఉందని, ఎన్టీఆర్ కు తామే నిజమైన వారసులమని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ అధినేత భావిస్తున్నారని సమాచారం.