YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సోమవారం కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివేకా హత్య కేసు గురించి మాట్లాడారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ చార్జషీట్ లో పెట్టించినవారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఆరోపించారు. జగన్ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ను చూసుకునే తెలంగాణ నేత రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రూ. వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువులు ఉంటే బయటపెట్టాలన్నారు.
ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఆమె స్పందించారు. తన భర్త అనిల్ కుమార్ బీజేపీ నేతను ఎక్కడా కలవలేదు. కలవబోరని స్పష్టం చేశారు. అవినాష్ మాదిరి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని షర్మిల ఎద్దేవా చేశారు.