Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు. విజయవాడలో రాజకీయ ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఆ ప్రధాన నాయకుల్లో వంగవీటి రాధా కూడా ఒకరు కావడం విశేషం. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009 లో రాజకీయ పురుడు పోసుకున్నారు రాధా. ఎన్నో ఆశలతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఆ ఆశలన్నీ కూడా గడిచిన పదిహేనేల్ల కాలంలో అడియాసలు ఆయ్యాయి. తనకంటే వెనుక రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన వారెందరో రాష్ట్ర స్థాయి నాయకులుగా స్థిరపడిపోయారు. ప్రతిసారి ఎన్నికలు వచ్చేనాటికి ఒక అడుగు ముందుకు, మరో రెండు అడుగులు వెనక్కి వెళుతోంది వంగవీటి రాధా రాజకీయ జీవితం. గడిచిన పదిహేనేళ్ళల్లో రాజకీయంగా సాధించింది అంటూ ఏమి లేకపోవడంతో ఆయన అనుచరుల్లో కూడా ఆత్మ స్టయిర్యం దెబ్బతింటోంది.
విద్యార్ధి దశ నుంచి ఆకస్మికంగా కాంగ్రెస్ లో చేరారు. రాజకీయంగా ఎదగడానికి ఎవరిమాటలో విని రాధా కాంగ్రెస్ ను వదిలిపెట్టి ప్రజారాజ్యం కండువా కప్పుకున్నారు. అక్కడ ఏమైనదో ఏమో గాని ఇముడలేక బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత జనసేన అంటూ విజయవాడలో హల్చల్ చేశారు. మళ్ళీ ఏమి దుర్బుద్ధి పుట్టిందో ఏమోగానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తో మంతనాలు జరిపారు. కానీ అటు జనసేనతో జత కట్టలేదు, ఇటు కాషాయం కండువా కప్పుకోలేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనే సామెతలా తయారైనది వంగవీటి రాజకీయ జీవితం. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ లో చేరకుండా, ఆయనకు నమ్మకస్తులైన అభ్యర్థి గెలుపు కోసం కష్టపడుతున్నారు.
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో రాధా విఫలమైనాడనే అభిప్రాయాలు సైతం విజయవాడలో ఉన్నాయి. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే రాజకీయంగా వెనుకబడి పోయాడని ఆయన సహచరులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలకు గ్రహాల అనుకూలం, అదృష్టం, జాతక బలం, వాస్తు అంటూ ఉండదు. సకాలంలో వచ్చిన అవకాశాలను అలోచించి దయిర్యంగా అడుగు ముందుకు వేసినప్పుడే ఎదుగుదల అనేది ఉంటుంది. వంగవీటి రాధా రాజకీయ జీవితంలో కూడా ఇదే జరుగుతోందని పలువురు అయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు.