ఏ ముహూర్తాన మొదలుపెట్టాడో కానీ ఆదిపురుష్ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఈ మూవీ మేకర్ ముఖ్యంగా.. దర్శకుడు ఓం రౌత్ తీరుపై అభిమానుల్లో కోపం నషాలానికి ఎక్కుతోంది. ఇప్పటికే చేసిన మేకర్స్ అనౌన్స్మెంట్ ప్రకారం జూన్ 16న సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆ తేదీకి అయినా రిలీజవుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎక్కడా బజ్ లేదు. సమయం దగ్గర పడుతున్నా సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్ క్లోజ్ అవ్వలేదని తెలుస్తోంది.
ప్రభాస్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. పేరుకు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా అందులో ఏ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ పెద్దగా ఉండటం లేదు. సలార్ – ప్రాజెక్ట్ కే- ఆదిపురుష్ 3డి .. వేటికీ సందడి లేదు. దీంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. మరోవైపు ఆదిపురుష్ మాత్రం ఫ్యాన్స్ ను మరింత టెన్షన్ పెడుతోంది.
మైథలాజికల్ కాన్సెప్ట్ బేస్డ్ గా వస్తున్న ఈ సినిమా థియేటర్లు బిజినెస్ ఇప్పటికే పూర్తి అయిపోవాల్సి ఉండగా ఇప్పటివరకు అసలు మొదలే కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తున్నాయి.
డిజిటల్ రైట్స్ కోసం కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో అందరూ షాక్ గురవుతున్నారు. ఆయా భాషలలో రిలీజ్ కోసం కూడా ఎవరూ పోటీలో లేరనే మాట బీటౌన్ లో వినిపిస్తోంది, మరోవైపు ఆదిపురుష్ 3డీకి హైప్ పెంచాలనుకున్న ఓంరౌత్ ప్రయత్నం విఫలం కావడమే గాక.. ఇప్పటికైనా సినిమాపై ప్రచారం మొదలు పెట్టకపోవడం అభిమానులను టెన్షన్ కు గురిచేస్తుంది. ఇక ఉగాది కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్ పై కూడా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓంరౌత్ పై సీరియస్ గా ఉన్నారు.
సోషల్ మీడియాల్లో అతడిపై ట్రోలింగ్ ఆగడం లేదు. ఇది వెనక ఇలాగే కంటిన్యూ అయితే అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది అదే జరిగితే ఆదిపురుష్ మూవీకి ఎదురు దెబ్బ తప్పదు. చూడాలి మరి ఈ సమస్య నుంచి ఆయన ఎలా గట్టెక్కుతారో.