Ayodhya Ram : అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠాపన కోసం యావత్ భారత దేశంతో పాటు ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికా లోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో అయోధ్యలో రామా లయం ప్రాణ ప్రతిష్ట మహో త్సవాన్ని పురస్క రించుకుని ఇక్కడ ఉత్సవం నిర్వహి స్తున్నారు.
21వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంట ల30 నిముషాల నుండి ఊరేగింపుగా బయ ల్దేరి స్వస్తి వాచకం, విఘ్నేశ్వర పూజ, పుణ్య వచనం అనం అతరం శ్రీ రామ తారక మహా మంత్ర హోమం, పూర్ణాహుతి ఆలయ ట్రస్టీ గంగవరపు రజనీకాంత్ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్నట్లు ఛైర్మన్ శేషు ఇంటూ రి, అధ్యక్షుడు పుట్టగుంట మురళీకృష్ణలు ఓ ప్రకట నలో తెలిపారు. హోమం అనంతరం శ్రీరామ మంత్ర పారాయణ, భజనలు, మహాప్రసాద నివేద న అనంతరం అయోధ్య రామాలయ ప్రతిష్ఠను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.