ప్రకాశం జిల్లా రాజకీయాలు వైసీపీ అధిష్టానానికి తల నొప్పి మారాయి. ఇప్పటికే మాగుంట, బాలినేని వ్యవ హారంలో తలమునకలవుతున్న అధి ష్టానంకు.. దర్శి వైసీపీ ఎమ్మెల్యే షాకిచ్చేందుకు సిద్ధ మైనట్లు సమా చారం అందుతుంది. ఈ క్రమంలో ఇవాళ దర్శిలో తన అనుచర వర్గంతో మద్దిశెట్టి వేణుగోపాల్ సమావే శం కానున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే విషయంపై అనుచరులతో చర్చించే అవకాశం ఉంది.. అనంతరం మీడియా సమావేశం ద్వారా తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, నియోజక వర్గాల ఇన్ ఛార్జుల మార్పుల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం వేణుగోపాల్ కు హ్యాడ్ ఇచ్చి దర్శి నియో జకవర్గం బాధ్యతలను బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగించింది. దర్శి నుంచి తప్పించినా ప్రత్యామ్నా యంగా తాను ఆశిస్తున్న ఒంగోలు ఎంపీ స్థానంకూడా కేటాయించకపోవటంతో మద్దిశెట్టి అదిష్టానంపై గుర్రు గా ఉన్నారు. తన అనుచర వర్గంతో చర్చించి తదు పరి కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయన ఎంపీ మాగుంట బాటలో నడవా లని నిర్ణయించినట్లు సమచారం.