Tragedy in Kamareddy : ఒకప్పుడు గుండెపోటు అనేది వయస్సు పైబడిన వారికి వచ్చేది. అయితే మారిన పరిస్థితులు.. ఆహార అలవాట్ల వల్ల గుండెపోటు అనేది చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా వస్తూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాలంలో గుండెపోటు వార్తలు అనేవి కామన్ గా మారుతున్నాయి. అయితే తాజాగా కామారెడ్డిలో ఓ యువకుడికి ఉద్యోగం వచ్చిందనే సంబరపడేలోపే మృత్యువు ఒడిలోకి వెళ్లడం విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా జగసాంబతండాకు చెందిన ప్రశాంత్ బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవలే అతడికి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. అయితే ఇంతలోనే స్వగ్రామంలో ప్రశాంత్ గుండెపోటుకు గురై హఠాత్తుగా మృతిచెందాడు. దీంతో ప్రశాంత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రశాంత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో జగసాంబతండాలో విషాదచాయలు నెలకొన్నాయి