చంద్రబాబు కేసులో 17-A పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తులు రిమాండ్ రిపోర్టుపై ఒకే అభిప్రాయం చెప్పారు. చంద్రబాబు రిమాండ్ ఆర్డర్ ను క్యాష్ చేయడం కుదరదని తెలిపారు. కేసు విచారణకు గవర్నర్ ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదని అనలేమని జస్టిస్ బోస్ స్పష్టం చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ సబబేనని దర్యాప్తు కొనసాగించవచ్చని జస్టిస్ త్రివేది తెలిపారు.
చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇద్దరు జడ్జిలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల టిడిపి అధినేతకు అనుకూలంగా తీర్పు రాలేదు. సీనియర్ న్యాయవాదులు ఈ కేసు ను వాదించారు. అయితే సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు రాలేదు. ఈ నేపధ్యంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.