Free Bus Facility From Hyderabad : ఏపీలో ఎన్నికలు మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈసారి ఎన్నికల్లో జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడేలా ఆంధ్రా జనాలు సిద్ధమయ్యారు. దార్శనికులు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఏపీ జనాలు ఎక్కువగా హైదరాబాద్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. దాదాపు 20 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ లోనే ఉన్నారు. వారందరూ ఇప్పటికే ఏపీకి పయనమవుతున్నారు. పేదలపై రవాణా భారం పడకుండా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి తెలుగు ప్రొఫెషనల్ వింగ్ హైదరాబాద్ టీమ్ వారు మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ వారి సౌజన్యంతో ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించటం జరిగింది.
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వయా విజయవాడ – శశి +91 90004 95959
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వయా రాజమండ్రి – కొండయ్య చౌదరి 095504 07777
హైదరాబాద్ నుంచి ఒంగోలు వయా నరసరావుపేట – సుధీర్ +91 97018 44438
హైదరాబాద్ నుంచి నెల్లూరు – మాచరావు +91 98488 11125
హైదరాబాద్ నుంచి అనంతపురం వయా కర్నూల్ – తేజస్విని పొడపాటి 99499 13513
నారా చంద్రబాబు నాయుడి గారి కోసం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ వారు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కావున తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయవలసినదిగా వారు మనవి చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే, మన బిడ్డలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. అలాగే ఆంధ్రుల రాజధాని అమరావతిని మహా నగరంగా తీర్చిదిద్దగలిగే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని అంటున్నారు. అందుకే హైదరాబాద్ లో ఉన్న ప్రతీ ఆంధ్రుడు వచ్చి టీడీపీకి అభ్యర్థులకు ఓటు వేసి ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు.