అయోధ్యలో కొలువుతీరిన రామ్ లల్లాకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు. తర్వాత రాముడి పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం చేశారు. అలాగే ప్రధాన అర్చకులు లక్ష్మీకాంత దీక్షితులు పాదాభి వందనం చేసి వారి ఆశీర్వాచనాలు తీసుకున్నారు. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న రామ మందిరం ఇప్పుడు అందరి కళ్ల ముందు ఆవిష్కృతమైంది. దేశ నలుమూలల నుంచి రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షిస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రధాని మోడీ అయోధ్యలో ఈరోజు రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజ రయ్యారు. రామమందిర ప్రాణప్రతిష్టను పురష్కరించుకోని ఆంద్రప్రదేశ్ లో భక్తులు ర్యాలీలు కుడా నిర్వహించారు.
Breaking News