Telugu Reading Competitions:‘దేశ భాషలందు తెలుగు లెస్స’. ఇది ఒక్క ఇండియాలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా చాటి చెప్తున్నారు మన తెలుగు వారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారి కుటుంబాల్లోని చిన్నారులు వారి మాతృ (తెలుగు) భాషను మరవద్దని వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నాటా, తానా లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లతో తెలుగు సంస్కృతిని అక్కడే పుట్టిన తెలుగు ఫ్యామిలీకి చూపిస్తుంటే. మరింత అడుగు ముందుకేసి తెలుగు భాష గురించి కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ చిన్నారుల కోసం కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంది. చిన్నారుల్లోని పఠనా సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈ పోటీలు చాలా దోహదపడతాయి. ‘శివరాం ప్రసాద్ యార్లగడ్డ’ ఈ పోటీలను నిర్వహిస్తుండగా, ‘ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్’ అధ్యక్షతన కొనసాగనున్నాయి. పోటీలు 17 సెప్టెంబర్, 2023వ తేదీ 2 గంటలకు ఎస్వీ టెంపుల్, టాఫ్ట్ రోడ్ 26233, నోవి, మిచిగావ్ 48374లో ఉంటాయని తెలిపారు.
ఇందులో రెండు కేటగిరీలను ఏర్పాటు చేసి బహుమతులను కూడా నిర్ణయించారు. మొదటి కేటగిరిలో 5వ తరగతిలోపు పిల్లలు పాల్గొంటారు. వీరికి మొదటి బహుమతి 200 డాలర్లు, రెండో బహుమతి 100 డాలర్లు, మూడో బహుమతి 50 డాలర్లు ఉంటాయి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రెండో కేటగిరీ ఇందులో కూడా వీరికి మొదటి బహుమతి 200 డాలర్లు, రెండో బహుమతి 100 డాలర్లు, మూడో బహుమతి 50 డాలర్లు బహుమతులు ఉంటాయి.
మరిన్ని వివరాల కోసం అధ్యక్షుడు దుగ్గిరాల కిరణ్, డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ +1 (732)781-8102 లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.