MLA PA Behavior : దుడ్డున్నోడిదే బర్రె అనేది నానుడి. బలమున్నోడిదే న్యాయం. బలం లేనోడిని ఎలాగైనా ఆడుకోవచ్చు. వాడిపై దాడి చేయొచ్చు. ఇంకా కసిగా ఉంటే చంపేయవచ్చు. అధికార మదం నెత్తికెక్కితే ఇలాగే ఉంటుంది. అశక్తుడైన ఓ వ్యక్తిని ఓ ఎమ్మెల్యే అనుచరుడిని విచక్షణా రహితంగా దాడి కొట్టారు. అచ్చం సినిమాల్లో లాగా పది మంది కలిసి కర్రలతో కొట్టడం కనిపించింది.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, అతడి పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ తన అనుచరులతో ఓ వ్యక్తిని చితక బాదాడు. ఇది అత్యంత హేయమైన చర్య. మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక అటవీ ప్రాంతంలో ఉన్నామా? అనే అనుమానాలు వస్తున్నాయి. సామాన్యులైతే క్షణాల్లో ప్రత్యక్షమయ్యే పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ కావడంతో పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.
ఒక మనిషిని ఇంత దారుణంగా కొడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది. ప్రజల కోసం ప్రభుత్వం పనిచేస్తోందా? లేక చోద్యం చూస్తోందా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీంతో సదరు వ్యక్తిని చావబాదినా అడిగే వారు లేరు. ఇంతకీ అతడు చేసిన అన్యాయం ఏమిటో తెలియడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలారా? ఏం సమాధానం చెబుతారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు.
మైకు పట్టుకుని మాటలు చెప్పడం కాదు. ఆచరించి చూపే వాడే ఆచార్యుడన్నట్లు దీనికి బీఆర్ఎస్ పార్టీ ఏం చర్యలు తీసుకుంటుంది. ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా? లేక పార్టీ నుంచి బహిష్కరిస్తారా? దొంగలు, గుండాలు అని సంబోధించే కేటీఆర్ సైతం దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఎదుటి వారిని విమర్శించడం కాదు మనం చేసే పనులు కూడా చూసుకోవాలి.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పీఏ దౌర్జన్యం
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు, ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్.. ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. pic.twitter.com/FYn9d7DfF4
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2023