30 C
India
Wednesday, May 15, 2024
More

    ఎన్టీఆర్ రూ.100 కాయిన్ – ఏపీలో సైలెంట్‌గా పావులు కదుపుతున్న బీజేపీ

    Date:

     

    తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకోవడానికి బీజేపీ సైలెంట్ వ్యూహం పన్నుతోంది. ఇప్పటికే తెలంగాణలో బలం పెంచుకుంటున్న ఆ పార్టీ ఇప్పుడు ఏపీలోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేకున్నా కేంద్రం లెవల్లో ఇక్కడి ప్రజలను ఆకర్షిస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలు ఆరాధ్య దేవుడిగా భావించే నందమూరి తారకరామారావు చిత్రాన్ని రూ.100 కైన్ పై ముద్రించడానికి ప్రతిపాదించింది. ఈ నాణెలకు సంబంధించిన సలహాలు, సూచనలు అడిగేందుకు ఆయన కుమార్తె పురంధేశ్వరి వద్దకు మింట్ అధికారులు వచ్చారు. ఈ నమునాకు పురంధేశ్వరి అంగీకారం తెలిపినట్లు సమాచారం. వీలైనంత త్వరలోనే ఈ కాయిన్ బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో భాగంగానే రూ.100 కాయిన్ తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు.

    దేశ వ్యాప్తంగా రాజకీయాలు నడిపిన నందమూరి తారకరామారవుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు సైతం పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. ఆయనపై ఉన్న అభిమానంతో పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు కూడా. ఈ డిమాండ్ల ను పరిగణలోకి తీసుకున్న కేంద్రం భారతరత్న ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ రూ.100 కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మను వేయడం వల్ల చిరస్థాయిగా నిలిచిపోతుందని భావించారు. ఎన్టీఆర్ కు ఈ గౌరవం ఇవ్వడం వల్ల తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కమలనాథులు ఆలోచించినట్లు తెలుస్తోంది.

    తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ రకరకాల ప్లాన్లు వేస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి పలు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. కొన్ని నెలల కిందట అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పడు జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా నేపథ్యంలోనే ఎన్టీఆర్ ను కలిశారని అంటున్నారు. కానీ రాజమౌళి, రామ్ చరణ్ ను ఎందుకు ఆహ్వానించలేదని కొందరు ప్రశ్నించారు.

    ఇప్పడు సీనియర్ ఎన్టీఆర్ విషయంలో అరుదైన గౌరవం ఇవ్వడం ద్వారా బీజేపీ మార్కులు కొట్టేయాలని చూస్తోంది. తెలుగు రాష్ట్రాలకు తాము ఆదరిస్తామని చెప్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి చెందిన పురంధేశ్వరిని పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకకుండా ఆమెకు ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. ఇప్పుడు రూ.100 కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ వేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను దోచేయాలని చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    AP Mood : ఏపీ మూడ్ తెలిసిపోయిందిగా.. పోస్టల్ బ్యాలెట్లలో ఆల్ టైమ్ రికార్డ్

    AP mood : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వైఎస్సార్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా..?...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...