Election Commission : ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 34 కోట్ల రూపాయల మేర నగదును సీజ్ చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. 11 కోట్ల నగదు, ఏడు కోట్ల విలువైన మద్యం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
10 కోట్ల మీర బంగారం, వెండి నగలను తనిఖీ లో పట్టుబడ్డయన్నారు. ఈసీకి సి విజిల్ యాప్ ద్వారా భారీగా ఫిర్యాదులు అందుతున్నాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. షెడ్యూల్ విడుదల తర్వాత సి విజిల్ యాప్ ద్వారా 5,500 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి 3040 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయని తెలిపారు.