Cash Seized : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ఓ లారీలో తరలిస్తున్న రూ. 8.40 కోట్లు పట్టుబడ్డాయి. డబ్బును తరలిస్తున్న వ్యక్తులు అధికారులకు ఎలాంటి పత్రాలు చూపించక పోవడంతో నగదును సీజ్ చేశారు. అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. దీంతోపాటు లిక్కర్, డ్రగ్స్, విలువైన వస్తువులు పట్టుబడ్డాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంకా పట్టుబడుతూనే ఉన్నాయి.
ఎన్నికల వేళ రూ. 10 లక్షలకు పైగా నగదు పట్టుబడితే జిల్లా ట్రెజరీలో జమ చేయాలని చట్టం చెపుతోంది. ఒకవేళ రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు పట్టుబడితే ఆదాపు పన్ను నోడల్ అధికారికి తెలియజేయాలి. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బును ఇన్ కం ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి ఆ నగదు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది. నగదు రికవరీ అయిన వ్యక్తి దానిని క్లెయిమ్ చేసుకోవచ్చు.