AP Volunteers : ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్న వాలంటీర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 615 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఇప్పటివరకు 79,865 మంది రాజీనామా చేయగా, వారిలో కొందరు వైసీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రానున్న రోజుల్లో మరి కొందరు వాలంటీర్లు రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడానికి రూ.5 వేల గౌరవ వేతనంతో వాలంటీర్లను నియమించారు.50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించారు. ఈయితే ఈ వ్యవస్థతో కొన్ని లాభాలుంటే అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ఎన్నికల వేళ వాలంటీర్లు పార్టీల తరపున ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వారి విధుల విషయంలోనూ కొన్ని షరతులు విధించింది. దీంతో విపక్షాలు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇప్పించడం లేదని వైసీపీ ఓ దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. కొందరు వాలంటీర్లపై ఒత్తిడి తీసుకొచ్చిన వైసీపీ నాయకులు వారితో రాజీనామా చేయించారు.