Kodi Kathi Case: ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగిన కోడి కత్తి కేసులో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, ప్రస్తుత విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ రావు పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ కోడి కత్తిని ఆయనే తీసుకొచ్చి ఈ ఘటనలో సాక్షిగా ఉన్న దినేశ్ కుమార్ కు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేరాన్ని జనపల్లి శ్రీనుపైకి నెట్టినట్లుగా తెలుస్తున్నది. ఈ క్రమంలో నే సీఎం జగన్ విచారణకు రావడం లేదని నిందితుడు శ్రీను తరపు లాయర్ సలీం ఆరోపించారు.
ఎన్ఐఏ న్యాయస్థానంలో మంగళవారం విచారణ ముగిశాఖ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో కుట్ర కోణం లేదని తేలింది. సీఎం జగన్ విచారణకు హాజరైతేనే మరిన్ని విషయాలు తేలుతాయి. రావాలి జగన్ .. చెప్పాలి వాదన.. ఇవ్వాలి ఎన్ వోసీ అనేది మా వాదన అంటూ చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. ఈ దాడిని తెలుగుదేశంపై నెట్టేసి, చంద్రబాబే బాధ్యుడంటూ నాడు వైసీపీ పెద్ద నాటకానికి తెరదీసింది. ప్రస్తుతం కేసు ఎన్ఐఏ పరిధిలో ఉంది.
కాగా కోర్టు విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. ఈక్రమంలో నిందితుడి బెయిల్ పిటిషన్ కూడా అదే రోజు విచారణకు రానుంది.మరోవైపు సీఎం జగన్ విచారణకు హాజరవ్వాలని, నిర్దొషి జీవితంతో ఆటలొద్దని వివిధ దళిత సంఘాల నాయకులు గాంధీ విగ్రహం వద్ద నిరసనకు సిద్ధం కాగా, పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక తన కొడుకును కాపాడాలని శ్రీను తల్లి సావిత్రి మీడియా ఎదుట వేడుకుంది. తనన కొడుకును పేదోడని అన్యాయంగా పెద్దలు ఇరికించారని, ఎలాంటి తప్పు చేయకున్నా జైలు పాలయ్యాడని రోదించింది. ఇక శ్రీను సోదరుడు కూడా న్యాయం కోసం భిక్షాటన చేస్తానని చెప్పుకొచ్చారు. ఐదేళ్లయినా తన తమ్ముడికి న్యాయం దొరకడం లేదని, నిరుపేదల మైనందుకే ఈ వ్యవస్థపై తమపై కక్ష కట్టిందని మండిపడ్డారు.
ఏదేమైనా కోడి కత్తి కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ ఘటనలో వేళ్లన్ని వైసీపీ నేతల చుట్టే తిరుగుతున్నాయి. పక్కా స్కెచ్ ప్రకారమే ఎన్నికల సమయంలో టీడీపీ కి నష్టం చేకూర్చేలా వైసీపీ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తున్నది.