All Set for Kollu Arrest : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుకు రంగం సిద్ధమైంది. రవీంద్ర తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో మద్యం కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణల మీద ఆయనను అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సీఐడీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారని సమాచారం.
టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేతలను ఒక్కొక్కరిని భయభ్రాంతులకు గురి చేసేందుకే వైసీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ప్రతిపక్షాలపై బురదజల్లే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి అరెస్టులకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇలాంటి వాటికి బెదరబోమని తెగేసి చెబుతున్నారు.
ప్రభుత్వం చేస్తున్న దురాగాతాలను ప్రజలు గమనిస్తున్నారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ నేతలు భయపడరు. ఎన్ని రోజులు జైలులో పెట్టినా మా పోరాటం ఆగదు. ప్రజలు మా వెంటే ఉన్నారు. వైసీపీ నేతల కుట్రలు ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇలాంటి బెదిరింపులకు దిగుతోంది. అయినా మేం లొంగేది లేదు. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం.