Margadarsi Case :
ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్ పై ఏపీ సీఐడీ అధికారుల వరుస దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుగా వారి తంతు ఉంది. ఏం లేకున్నా ఏదో ఉన్నట్లు ప్రచారం చేసి మార్గదర్శిని దెబ్బతీయాలనే కుట్ర తప్పా ఏం కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మార్గదర్శి చిట్ ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకున్నా, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జగన్ ప్రభుత్వం ఇలా మార్గదర్శిపై పడిందని, ఇలా చేసి ఈనాడు ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టాలనే ఉన్నట్లు ఎవరికైనా తెలిసిపోతుంది.
అయితే ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం సీఐడీ అత్యుత్సాహం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నది. మార్గదర్శిలో ఏదో జరిగినట్లు హడావుడి చేసిన సంబంధిత అధికారులు ఇప్పటివరకు తేల్చిందేమి లేదు. దీంతో ఇఫ్పుడు సీఐడీ చీఫ్ సహా మరో నలుగురు అధికారులను కోర్టు పిలిచింది. వారిని మందలించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నా మార్గదర్శి ఎండీ శైలజపై లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేశారని ప్రశ్నిస్తే నోరు మెదపలేకపోయారు. అయితే ప్రస్తుతం కోర్టు ధిక్కరణ అంటూ మార్గదర్శి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏపీ సీఐడీ కుట్ర చేస్తోందని వారు ఆరోపించారు.
అయితే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగా ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు. గతంలో జగన్ తో కలిసి అవినీతిలో పాలుపంచుకొని పలువురు జైలుకు వెళ్లారు. తాజాగా కోర్టు ధిక్కరణ అంశంలో కూడా అధికారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఏదేమైనా ఇలా అధికారులను తన కక్ష సాధింపుల కోసం వాడుకోవడం జగన్ కు మాత్రమే సాధ్యమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. రాష్ర్టంలో ఏ ఒక్క చిట్ ఫండ్ ను టచ్ చేయకుండా ఒక్క మార్గదర్శినే టార్గెట్ చేయడం వెనుక మతలబు ఏంటో అందరికీ తెలిసిందే. ఇది కూడా గుర్తించకుండా జగన్ తన మీద తానే బురద జల్లుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వ కక్షసాధింపుల కోసం ఇలా మరి ఇబ్బంది పెట్టడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.