ఇక మరోవైపు పార్టీ అభ్యర్థుల ఎంపికపై సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టారు. సర్వేలో నెగిటివ్ టాక్ ఉన్న వారిని పక్కన పెట్టబోతున్నట్లు సమాచారం. ఈసారి కనీసం 35 మంది సిట్టింగులకు ఈసారి టికెట్లు దక్కబోవనే ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నివేదిక తెప్పించుకున్నారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది. ఇక వాటన్నింటినీ బేరీజు వేసుకొని వివిధ సమీకరణాలకు అనుగుణంగా జాబితా సిద్ధం చేస్తున్నారు.
వచ్చే ఏడాది ఏప్రిల్, మేల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జజిలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఇలా అన్ని స్థాయిల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మేరకు పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. వైఎస్ జగన్ సహా, విజయసాయి, సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సహా కీలక నేతలు హాజరు కాబోతున్నారు.2024 ఎన్నికల్లో పార్టీని అధిాకారంలోకి తేవడమే లక్ష్యంగా ఆయన తన వ్యూహాలను శ్రేణులతో పంచుకోనున్నారు. ఈ మేరకు కలిసి నడవాలని, సమన్వయం చేసుకోవాలని , వర్గ విభేదాలు పక్కన పెట్టాలని దిశా నిర్దేశం చేయనున్నారు.
ReplyForward
|