Tollywood :
టాలీవుడ్ ఇండస్ట్రీ కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు సంపాదించుకుంటూ వస్తోంది. కానీ ఈ విషయాన్ని 69 సంవత్సరాలకు ఇండియా గుర్తించింది. జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ హీరోగా మొదటి సారి అల్లు అర్జున్ ను ఎంపిక చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏకంగా 11 జాతీయ అవార్డులను ప్రకటించింది.
ఇది నిజంగా రాష్ట్రానికే గర్వకారణమే. ఆ సంతోషం, క్రెడిట్ దూరం చేసుకొంది వైసీపీ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ, తిప్పలు పెడుతూంది. చిరంజీవి లాంటి లెజెండ్ స్టార్ చేతులు జోడించి ప్రార్థించినా కనికరించలేదు. పైగా ‘చిరంజీవి జగన్ ను వేడుకుంటున్నాడు’ అంటూ ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అవమానాలకు గురి చేశారు.
దీంతో పాటు మంత్రి రోజా, పోసాని, రాంగోపాల్ వర్మ లాంటి వారు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ పట్ల కత్తులు దూరుతుండగా వారితో చేయిస్తుంది వైసీపీ ప్రభుత్వమే అన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. అందుకే సీఎం స్వయంగా ఆహ్వానించినా తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి వెళ్లేందుకు ససేమీరా అంటుంంది. దీనికంటే విచారకరమైన విషయం ఏంటంటే.. వైసీపీ ధోరణి చూసి ఏపీలో సినిమాలు ఆడించుకోవడం కష్టమవుతుందనే ఆలోచనలో కొంత మంది దర్శకులు, నిర్మాతలు తెలంగాణలో సినిమాలు తీసేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సినీ పరిశ్రమలో వస్తున్న ఈ మార్పు చూసి ఏపీ ప్రజలు సంతోషించాలా..? బాధపడాలా..?
వైసీపీ ప్రభుత్వం ధోరణితో టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి కూడా ఏపీకి దక్కడం లేదన్న రూమర్లు వినిపిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డు సాధించిన సమయం, ఇప్పుడు 6 జాతీయ అవార్డులు, మరో 5 తెలుగు సినిమాలకు జాతీయ స్థాయి అవార్డులు సాధించుకున్నా.. వాటి గురించి ఏపీ ప్రభుత్వం ఎందుకు గొప్పగా చెప్పుకోలేకపోతోంది? అనే ప్రశ్నకు వేధింపులే కారణమన్న జవాబు వినిపిస్తుంది.