AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరం మారినట్లు కనిపిస్తుంది. రాను రాను ఏపీ రాజకీయాలకు యువరక్తం ఎక్కుతోంది. న్యూ జనరేషన్ ఎంటర్ అవుతోంది. బీజేపీ పురంధేశ్వరి స్టేట్ చీఫ్ గా ఉన్నవారు. ఆమె 64 ఏళ్ల వయస్సులో పార్టీని లీడ్ చేస్తున్నారు. ఎన్నికల వరకు ఆమె మారవచ్చు.. ఆమె స్థానంలో మరో యంగ్ లీడర్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. పురంధీశ్వరిది కూడా వయస్సు పెద్దదిగా కనిపించదు. కానీ జగన్, పవన్ కళ్యాణ్ తో పోలిస్తే మాత్రం పెద్దదనే చెప్పవచ్చు. అందుకే వచ్చే ఎన్నికల వరకు మార్పు జరగవచ్చు.
ఇక, మిగతా నాయకులను పరిశీలిస్తే జగన్ కు 51 సంవత్సరాలు, షర్మిల 50, లోకేశ్ 40, పవన్ కళ్యాణ్ 52 ఈ నలుగురు కూడా యువతరమే. బీజేపీ వేగంగా స్పందించి యంగ్స్టర్ ను ఏపీ అందలం ఎక్కించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఈ సారి పాదయాత్ర మాత్రం లోకేష్ చేశారు. టీడీపీలో లోకేష్ ను కీలకం చేస్తూ ఎమర్జింగ్ లీడర్ గా చేస్తున్నారు.
తెలంగాణలో కూడా ఎప్పుడో మార్పు చెందింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. బీఆర్ఎస్ లో కూడా కేటీఆర్ కీలకంగా మారారు. తన కొడుకుకు పార్టీలో ప్రాధాన్యం పెంచారు కేసీఆర్. బీజేపీని పరిశీలిస్తే మొన్నటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ యువకుడే. రఘునందన్ రావు, కొత్తగా పైడి రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్ యంగ్ స్టర్లే. తెలంగాణలో యంగర్ జనరేషన్ నే ప్రోత్సహించాయి.