ATA Sayyandi Padam : వచ్చే నెల (జూన్) 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అట్లాంటా అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో 18వ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే అమెరికా వ్యాప్తంగా ‘సయ్యంది పాదం’ పేరుతో డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానం నుంచి గెలుపొందిన ప్రవాస చిన్నారులు, యువతీ, యువకులకు ఆటా సభల వేదికపై ఫైనల్స్ లో తలపడేందుకు అవకాశం కల్పిస్తామని అధ్యక్షురాలు బొమ్మకంటి మధు, కన్వీనర్ పాశం కిరణ్ తెలిపారు.
లాస్ ఏంజలీస్, రాలీ, నాష్ విల్, అట్లాంటా, న్యూ జెర్సీ, డల్లాస్, ఆస్టిన్, ఫిలడెల్ఫియా, షార్లెట్, వాషింగ్టన్ డీసీ, చికాగో, తదితర నగరాల్లో పూర్తయిన ఈ పోటీలు మరిన్ని నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 7 నుంచి 13 సంవత్సరాల వారు జూనియర్ విభాగంలో, 14 సంవత్సరాలు ఆపై వారు సీనియర్ విభాగంలో క్లాసికల్, నాన్ క్లాసికల్, సోలో, గ్రూప్ వంటి పోటీల్లో సత్తా చాటుతున్నారు.
‘సయ్యంది పాదం’ ఛైర్ పర్సన్ శృతి చిట్టూరి, కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ, అడ్వయిజర్ రాజు కాకర్ల, కో చైర్ పర్సన్ వాణి గడ్డం, మెంబర్లు రజనీకాంత్ దాడి, గౌరీ కారుమంచి, చిట్టి అడబాల, అట్లాంటా నుంచి సందీప్ రెడ్డి, కిషన్ దేవునూరి, నీలిమ గడ్డమణుగు, ఉదయ ఈటూరి, మాధవి దాస్యం, జయచంద్రా రెడ్డి, శ్రావణి రాచకుళ్ల, నిరంజన్ పొద్దుటూరి, రాలీ నుంచి శృతి ఛామల, గణేష్ కాసం, రాధా కంచర్ల, అజిత చీకటి, కీర్తి ఎర్రబెల్లి, పవిత్ర రత్నావత్, శ్రీదేవి కటిక, రజని త్రిపురారి, షాలిని కల్వకుంట్ల, కిశోర్ గూడూరు, నరేంద్ర నూకల, సుశీల్ చండ, నాష్ విల్ నుంచి రామకృష్ణా రెడ్డి అల, క్రిష్ నూకల, లావణ్య నూకల, సాయిరామ్ రాచకొండ, బిందు మాధవి చండ, క్రాంతి ఏళ్ల, సునీత నూకల, షార్లెట్ నుంచి వెంకట రంగారెడ్డి సబ్బసాని తదితరులు పోటీల నిర్వహణకు సహకరించారు.