Bajrang Dal Mantram : దేశం కోసం పోరాడేది బీజేపీ మాత్రమే, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ వాళ్లు తమ స్వార్థ రాజకీయాలు చేస్తుంది అని. పదేపదే చెప్పుకుని దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే పంథాను కొనసాగిస్తూ ముందుకు వెళ్తుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తాము అధికారంలోకి వస్తే ఏం అభివృద్ది చెస్తాం అని చెప్పరు. కాని అక్కడ ఉన్న సెంటిమెంట్ అధారంగా మతం రాజకీయం చేసి ఓట్లు దండుకుంటుంది.
ఇప్పుడు కర్నాటకలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని చూస్తే అలాగే కనిపిస్తుంది. సీఎంలుగా పనిచేసిన యడ్యూరప్ప, బస్వరాజ్ బొమ్మై లు కర్నాటకలో ఫలానా ప్రాజెక్టు కట్టాం, రోడ్లు అభివృద్ది చేశాం అని చెప్పకోవడం లేదు. బీజేపీ ప్రచారం అంతా ప్రధాని మోడీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతు తనను కాంగ్రెస్ రోజు తిడుతున్నారని, ప్రజల కోసం పనిచేస్తున్నానని వాళ్లు తనను ఎంత తిడితే అంత ఎదుగుతాను అన్నారు. ఆ తర్వాత రాష్ర్ట బీజేపీ నేతలు తమ కులాన్ని కాంగ్రెస్ వాళ్లు కించ పరుస్తున్నారని ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్.. తాము అధికారంలోకి వస్తే కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేసే భగరంగ్ దళ్ లాంటి సంస్థలపై కేసులు నమోదు చేస్తామని, అవసరమయితే నిషేధిస్తామని చెప్పింది. కొతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఆ విషయాన్ని పట్టుకుని భజరంగ్ దళ్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిషేధిస్తుంది అని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇటీవల విడదల అయిన కేరళ స్టోరీ గురించి తీసి అక్కడ ఉగ్రవాదులు చేసే దాడిని కేరళ స్టోరి సినిమా చూపించిందని దానికి కాంగ్రెస్ కారణం అన్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక కర్నాటకను అభివృద్ధి చేస్తామని చెప్పడం మరిపోయి హనుమాన్ చాలీసా చదువుతోంది బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో వస్తే హనుమాన్ ఆలయాలను నిషేధిస్తుంది అన్నట్లు రెచ్చగొడుతుంది బీజేపీ, అయితే భజరంగ్, కేరళ స్టోరి అనే సున్నితమైన అంశాలు బీజేపీకి ఏ మేరకు ఓట్లు రాలుస్తాయా.. వేచి చూడాలి.