Big Day For Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ రోజు న్యాయపరంగా బిగ్ డే కానుంది. స్కిల్ స్కాం కేసులో నేడు ఆయనకు ఉపశమనం లభిస్తుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తికాగా, తీర్పు రిజర్వు చేసింది. అయితే తీర్పు బుధవారం వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఫైబర్ నెట్ కేసు లో విచారణ రేపు జరగనుంది.
గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఈ కేసులు నమోదు చేశారని, స్కిల్ స్కాం కేసు కొట్టివేయాలని చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ఇక హైకోర్టులో కూడా ఇసుక అక్రమ కేసులో బెయిల్ కూడా ఏపీ హైకోర్టులో బుధవారం విచారణకు రానుంది. ఏదేమైనా సుప్రీం కోర్టు ప్రకటించే తీర్పు చంద్రబాబుకు కీలకం కానుంది. ఇక ఈ తీర్పుపైనే టీడీపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చంద్రబాబు ఈ కేసు నుంచి బయట పడుతారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు సుప్రీం కోర్టులో సాగవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే తన అరెస్ట్ అక్రమమని కోరుతూ గతంలో నే క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు వేశారు. దీనిని హైకోర్టు కొట్టివేసింది. దీనిపై సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీం కోర్టులో జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ ఎం త్రివేదిల ధర్మాసంన 3-4 దఫాలుగా విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున ముకుల్ రోహిత్గీ వాదించారు. కోర్టులో వాదనలన్నీ సెక్షన్ 17 ఏ చుట్టూనే సాగాయి. ఒక క్వాష్ పిటిషన్ కొట్టివేస్తే చంద్రబాబు మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన అనంతరం తిరిగి జైలుకు రావాల్సి ఉంటుంది. క్వాష్ అంగీకరిస్తే ఇక చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడినట్లే అవుతుంది.