Oscar Award to Natu Natu :
ప్రపంచ సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్ ప్రధమ స్థానంలో ఉంటుంది. ఈ ఆస్కార్ వేడుక ఈ ఏడాది అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఎంతో ఘనంగా ముగిసింది.. మరి ఈ వేడుకలో 23 విభాగాల్లోని విజేతలకు అవార్డులను అందించింది. ఈసారి ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో మన తెలుగు సినిమాకు కూడా చోరు దక్కింది.
95వ ఆస్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు సాంగ్ చోటు దక్కించు కోవడమే కాకుండా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. మరి ఈ సాంగ్ ఆస్కార్ అందుకోగా దీనిని కంపోజ్ చేసిన ఎం ఎం కీరవాణి, సాహిత్య రచయిత చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. మన తెలుగు సినిమాకు ఆస్కార్ రావడంతో తెలుగు జాతి గొప్పదనం ప్రపంచ నలుమూలలా విస్తరించింది.
ఈ సాంగ్ వల్ల మనకు ఆస్కార్ దక్కడమే కాకుండా జ్యురీ మెంబర్స్ అయ్యే ఛాన్స్ కూడా టాలీవుడ్ కు దక్కింది. ఇక తాజాగా ఆస్కార్ నుండి మరో శుభవార్త అందడంతో ఇప్పుడు మరింత లక్కీ అనే చెప్పాలి. ఈ ఆస్కార్ అవార్డుల్లో ఆస్కార్ ప్యానెల్ లో మెంబర్ అయిన వారికీ మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది అనే విషయం తెలిసిందే..
మరి వచ్చే ఏడాది ఆస్కార్ ఎన్నికల్లో మన టాలీవుడ్ నుండి కూడా ముగ్గురు సబ్యులకు ఓటు వేసే అవకాశం రావడంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. వచ్చే ఏడాది మార్చి 10న జరగబోయే ఆస్కార్ వేడుకల్లో ఓటు వేసే అవకాశం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎం ఎం కీరవాణి, చంద్రబోస్ లకు దక్కింది. దీంతో మన టాలీవుడ్ కు ఇది శుభవార్త అనే చెప్పాలి. అయితే ఇందులో రాజమౌళికి మాత్రం చోటు దక్కలేదు.