BJP Central Election Committee : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేప థ్యంలో బిజెపి మరో జాబితా ప్రకటనపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో ఈరోజు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది.
ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి పేర్ల ను ప్రకటించనుంది. తెలంగాణలో 15 స్థానాలకు పేర్లు ప్రకటించక మిగిలిన రెండు స్థానాలు, పొత్తు లో భాగంగా ఏపీలో పోటీ చేసే ఆరు సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేప థ్యంలో అభ్యర్థులు ఎంపికపై బిజెపి అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేం దుకు బిజెపి ప్రయత్నం చేస్తుండగా అటు అభ్య ర్థులు ఎంపికలోను పలు జాగ్రత్తలు తీసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజెపికి ఓటు బ్యాంకు పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.