Rahul Gandhi Viral Photo :
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విషయంలో ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది. రాహుల్ గాంధీ నయా రావణ్ అంటూ భారతీయ జనతా పార్టీ పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో అతన్ని మత వ్యతిరేకిగా చూపించే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇందులో ఏడు తలలతో రాహుల్ గాంధీ పోస్టర్ ను రూపొందించారు. దీనిపై కాంగ్రెస్ నేతల నుంచి ఘాటైన స్పందన వస్తోంది.
ఈ పోస్టర్ పైభాగంలో ‘భారతదేశం ప్రమాదంలో ఉంది’ అని రాసి ఉంది. అదే పోస్టర్లో ‘రావన్’ అని ఇంగ్లీషులో రాసి, దాని కింద ‘ఎ కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్ డైరెక్షన్ బై జార్జ్ సోరోస్’ అని కూడా రాసి ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి దీనిని విడుదల చేస్తూ, ఇది కొత్త శకం యొక్క రావణుడు అని పేర్కొంది. అతను దుర్మార్గుడు, మత విరోధి, రామ వ్యతిరేకి. భారతదేశాన్ని నాశనం చేయడమే వారి లక్ష్యం అని పోస్టర్ లో పేర్కొన్నారు.
జార్జ్ సోరోస్ పేరు ఎందుక జోడించారు..?
రాహుల్ గాంధీపై దాడి చేసే పోస్టర్లో జార్జ్ సోరోస్ పేరును బీజేపీ చేర్చింది, ఎందుకంటే కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో సోరోస్ ప్రజలు పాల్గొన్నారని బీజేపీ ఆరోపించింది. సోరోస్ సహాయకుడు, ‘ఓపెన్ సొసైటీ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షుడు సలీల్ శెట్టి రాహుల్ పర్యటనకు హాజరయ్యారని బీజేపీ ఆరోపించింది. ఈ ఎన్జీవోకు అమెరికన్ బిలియనీర్ సోరోస్ నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీపై సోరోస్ అభ్యంతరకర వ్యాఖ్యలు ..
భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందని, కానీ ప్రధాని మోదీ ప్రజాస్వామ్యం కాదని సోరోస్ గతంలో విమర్శించారు. సీఏఏ, కాశ్మీర్ నుండి సెక్షన్ 370 తొలగింపును లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీపై ఈ వ్యా్ఖ్యలు చేశారు. సోరోస్ అమెరికాలో చాలా ధనవంతుడైన వ్యాపారవేత్త. అతను చాలాసార్లు ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాడు.