Telangana BJP :
తెలంగాణలో బీజేపీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించే పనిలో పడింది. కానీ ఊహించిన విధంగా పోటీ తత్వం కనిపించడం లేదు. దీంతో ఆయా స్థానాల్లో బీ ఫాం కోసం గట్టిగా ప్రయత్నించడం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పినా ఆ వాతావరణం కనిపించడం లేదు. ఇరవై చోట్ల మాత్రమే సమర్థులైన అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా చోట్ల పోటీ కనిపించడం లేదు.
అభ్యర్థులున్నా కాంగ్రెస్ పార్టీలో లాగా దరఖాస్తు రుసుం తీసుకోవడం లేదు. టికెట్ కావాలనుకునే వారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. పార్టీ అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుని టికెట్ కేటాయిస్తారు. దీంతో పార్టీ కార్యాలయంలో సందడి కనిపించడం లేదు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా వస్తున్నారు. టికెట్ కావాలని దరఖాస్తు చేసుకుంటున్నారు.
కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రఘునందన్ రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటి వారున్న చోట అభ్యర్థులు రెడీగా ఉన్నా మిగతా చోట్ల మాత్రం ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. ఇరవై స్థానాల్లో మాత్రమే బలమైన అభ్యర్థులను నిలబెట్టగలమని నిర్ణయానికి వచ్చారు. నియోజకవర్గాల్లో పోటీ లేకపోయినా బీఫాం కోసం ప్రయత్నించేవారు ఎక్కువగానే ఉన్నారు.
ఈనేపథ్యంలో బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరుకుతారో లేదో తెలియడం లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వస్తారేమోనని చూసినా ఎవరు రావడం లేదు. దీంతో బీజేపీలో అంతర్మథనం మొదలైంది. టికెట్ల కేటాయింపులో అభ్యర్థులు లేకపోతే ఎలా అనే సంశయాలు వస్తున్నాయి. ఇది బీజేపీలో ఆలోచనలు రాజేస్తోంది.
ReplyForward
|