Bye Bye Modi : దేశంలో హిందుత్వ వాదం ఎక్కువైపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెక్యూలర్ భావాలు పక్కకుపోయి మొత్తం హిందుత్వ భావజాలం పెరిగిపోయింది. మోడీ, అమిత్ షాలు బహిరంగంగానే ఈ హిందుత్వ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తమను తాము ఓన్ చేసుకున్నారు. అయోధ్య, పాక్ పై దాడులు సహా అన్నింటిని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
దేశంలో ఇప్పుడు రెండు సార్లు అధికారంలోకి వస్తున్న మోడీకి మూడోసారి గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ ఆయన పాలనలో మైనార్టీలు ఆందోళనగా ఉన్నారు. విద్వేషాలు రగులుతున్నాయి. దాడులు పెరుగుతున్నాయి. అందుకే బైబై మోడీ అంటూ ఒక కొత్త పాట అందరినీ ఆలోచింపచేస్తోంది. మోడీ దిగిపోవడాన్ని హైలెట్ చేసి చూపిస్తోంది.
మోడీ పాలనలో కార్పొరేట్లకు దోచిపెడుతున్న తీరును ఈ పాటలో హైలెట్ చేశారు. రైతులు, పేదలకు మోడీ ఏం చేయడం లేదని.. టెక్నాలజీ పేరిట కొందరికే మేలు చేస్తున్నాడన్నట్టుగా పాటను రూపొందించారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. మోడీ హయాంలో పేదల కంటే అంబానీ, అదానీలాంటి వారే బాగుపడ్డారన్న అన్నట్టుగా పాటను రూపొందించారు.
బైబై మోడీ అంటూ సాగుతున్న ఈ పాట వైరల్ అవుతోంది. దాన్ని ఇప్పుడు కింద చూడొచ్చు.