Minister Peddireddy : చంద్రబాబు రాజకీయ వికలాంగుడని.. పోత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సీఎం జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నా రని ఇచ్చిన హామి ప్రకారం కర్నూలుకు న్యాయ రాజధాని తీసుకొస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి సమావేశమైయ్యారు.వైసిపి మేము సిద్దం బస్సు యాత్ర ఈ నెల 28వతేది నుంచి ప్రారంభం కానుందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఈ నెల 28న ప్రారంభమైయ్యే బస్సు యాత్ర 28,29,30వ తేది వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతుందని.. అనంతరం నెల్లూరు మీదుగా విజయవాడ మిగతా జిల్లాల్లో సిద్ధం బస్సు యాత్ర ఉంటుందన్నారు.