Chandrababu Prove Innocent : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు ప్రతిపక్ష నేతను ఇబ్బంది పెట్టడమే పరిగా ఏపీ ప్రభుత్వం పావులు కదిపింది. టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కేసులతో ఇబ్బంది పెడుతున్నది. ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. మధ్యంతర బెయిల్ తో ఆయన మంగళవారం బయటకు వచ్చారు.
అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ ముందుకెళ్తున్నదనే అభిప్రాయం ప్రజలందరిలో కలుగుతున్నది. టీడీపీ శ్రేణులు కూడా ఇదే ఆరోపిస్తున్నాయి. దీంతో పాటు ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, తాజాగా మధ్యం కేసు అంటూ వివిధ కేసులతో ముప్పు తిప్పలు పెడుతున్నది. అయితే ప్రత్యేకంగా ఆధారాలేం లేకున్నా అభియోగాలు మోపుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఎఫ్ఐఆర్ లో పేరు లేకున్నా చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత పేరు ఎంట్రీ చేసింది. ఇక ఏసీబీ కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేస్తూ ఎన్నికల వరకు ఆయనను ప్రజల్లోకి వెళ్లేందుకు లేకుండా చేయాలనే తలంపుతోనే ప్రభుత్వ పెద్దలు వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారనే వాదన తెరపైకి వస్తున్నది. కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో 53 రోజులుగా ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచింది.
ఏసీబీ కోర్టు తీర్పుతో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి వరుస కేసులతో ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ఇక వీటి నుంచి చంద్రబాబు ఎలా బయట పడుతారో వేచి చూడాల్సి ఉంది. న్యాయ పోరాటం లో ఆయన నెగ్గుకు వస్తారని శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. చివరకు గెలిచేది న్యాయమే అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా 73 ఏండ్ల వయస్సులో పెద్దాయనను ఇబ్బంది పెడుతున్నారని, రాజకీయంగా ఎదుర్కొలేక అభియోగాలు మోపుతూ కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు తెలిసింది ఇది మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు.