Chandrababu : పెన్షన్ల విషయంలో వైసిపి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తండ్రి చనిపోయినప్పుడు ,బాబాయి చనిపోయినప్పుడు రాజకీయ లబ్ధి పొందాలని ఆయన ఆరోపించారు.
వాలంటీర్లను చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వైసిపి స్వార్థ ప్రయోజనాల కోసం పెన్షన్లను ఇవ్వాల్సిన 13 వేల కోట్లను దారి మళ్ళిం చారని ఆరోపించారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని వైసిపి నేతలు ఒత్తిడి చేస్తున్నారని వాలంటీర్ల పై అక్రమ కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
వైసిపి ప్రభుత్వం కావాలని పెన్షన్ల విషయంలో వృద్ధులను ఇబ్బందులకు గురిచేస్తుం దని సైకో ముఖ్యమంత్రి వృద్ధులని ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొందు తు న్నారని చంద్రబాబు ఆరోపించారు. శవ రాజకీయాలు వైసిపి డిఎన్ఎ లో ఉన్నాయని విరుచుకుపడ్డారు. జులైలో ఏప్రిల్ నుంచి మూడు నెలల పెన్షన్లు ఒకేసారి ఇస్తామని నేను ప్రకటించడంతో ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు.