Road Accident : కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో డీకొని నలుగురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొల్లాబొత్తుల నవీన్ జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు 8 మంది ఆటోలో యానాం వెళ్లారు. వేడుకల అనంతరం పాశర్లపుడికి తిరిగి వస్తుండగా చేపల లోడుతో వస్తున్న లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా నలుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో కోనసీమ జిల్లా నగరం గ్రామానికి చెందిన సాపే నవీన్, కొల్లబత్తుల జతిన్, పి.గన్నవరం మండలానికి చెందిన వల్లూరి అజయ్, మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన నల్లి నవీన్ కుమార్ ఉన్నారు.