CM Jagan : చంద్రబాబును నమ్మితే గోవిందా.. గోవిందా అని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచా భేరీలో భాగంగా సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్ లో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని, ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటికి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించేవని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.
‘‘జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. అంటే.. మళ్లీ మోసపోవడమే.. చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరమా సిద్ధమా..? ’’ అని పార్టీ శ్రేణుల్ని ప్రశ్నించారు.
మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది..? గోవిందా.. గోవిందా.. ఇది ఆ తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా.. గోవిందా.. కాదు. చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా అతలాకుతలం అయ్యారో చెప్పే గోవిందా.. గోవిందా.. అని పేర్కొన్నారు.